తెలంగాణ: ఉపాద్యాయ అర్హత పరీక్ష (TET-2023) పరీక్ష రాసేందుకు వచ్చి గర్భిణి మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. రాధిక అనే గర్భిణీ పటాన్చెరు మండలం ఇస్నాపూర్లో టెట్ పరీక్ష రాసేందుకు వచ్చింది. పరీక్షకు వెళ్లే తొందరలో వేగంగా పరీక్ష గదికి చేరుకున్న అభ్యర్థిని రాధిక బీపీ ఎక్కువై పరీక్ష గదిలోనే పడిపోయింది. రాధికను భర్త అరుణ్ హుటాహుటిన పటాన్చెరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే రాధిక మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.