Visakhapatnam: మే 1 నుంచి తగరపువలసలో ఉచిత శిక్షణ

admin
By admin 208 Views
1 Min Read

Visakhapatnam News: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) తగరపువలస శాఖ ఆద్వర్యంలో మే 1వ తేదీ నుంచి తగరపువలసలో శ్రీ క్రిష్ణ జూనియర్‌ డిగ్రీ కాలేజ్‌లో కంప్యూటర్‌ అండ్‌ స్పోకెన్‌ ఇంగ్లీష్‌ ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని ఏబీవీపీ రాష్ట్ర ఎస్‌ఎఫ్‌డీ కో కన్వీనర్‌ లొడగల అచ్చిబాబు తెలిపారు. డీఎల్‌డీఏ చైర్మన్‌, భీమిలీ జెడ్పీటీసీ గాడు వెంకటప్పడు చేతులు మీదగా పాంప్లేట్‌ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 24,25,26 తేదీలలో జాయినింగ్‌ అప్లికేషన్‌ పెట్టుకోవలన్నారు.

ఏబీవీపీ వారు విద్యార్థి సమస్యలపై పోరాడుతూ, పలు రకాల సేవా కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు, శ్రమానుభవ శిబిరాలు, ఉత్తమ విద్యార్థి అభినందన సభలు, ఉచిత భోధన తరగతులు ఇలా చక్కని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. వేసవిలో పిల్లలు సమయం వృద్ధా చేయకుండా ఈ అవకాశాన్ని విద్యార్థులు అందరు వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 9908116816, 7386996808, 9381154587 ఫోన్‌ నెంబర్లకు సంప్రదించవలసిందిగా ఏబీవీపీ సభ్యులు తెలిపారు.

/ Web Stories /

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Archita Phukan photos with adult star Kendra Lust goes viral kayadu lohar Latest Pics Viral #kayadu_lohar