పద్మనాభం ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. యువకుడు మృతి

admin
By admin
130 Views
1 Min Read

విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం పరిధిలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండల కేంద్రానికి సమీపంలో ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం (పద్మనాభం ఘాట్ రోడ్డులో) దర్శనం పూర్తిచేసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

పద్మనాభం ఘాట్ రోడ్డులో కారు దిగువకు వస్తున్న సమయంలో డ్రైవర్ వాహనాన్ని న్యూట్రల్‌లో పెట్టి అతివేగంగా నడపడంతో అదుపు తప్పింది. దీంతో కారు రోడ్డుపక్కనే ఉన్న లోతైన తోటల్లోకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో నర్సీపట్నానికి చెందిన వి.వి. ప్రసాద్ (28) అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న మిగతా ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఏడుగురు ప్రయాణిస్తున్నట్లు సమాచారం.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అతివేగం మరియు నిర్లక్ష్య డ్రైవింగ్‌ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు.

telegram

Bharat Shorts Whatsapp Channel

Share This Article
Leave a Comment