బిహార్లో జరిగిన ఈ ప్రమాదం భారత రైల్వే చరిత్రలో అత్యంత ఘోరమైనదిగా నిలిచింది. నాడు మాన్సీ నుంచి సహర్సాకు వెళుతున్న ప్యాసింజర్ రైలు ఏడు బోగీలు పట్టాలు తప్పి భాగమతి నది వంతెన పైనుంచి నదిలో పడిపోయాయి. దాదాపు 750 మంది నదిలో కొట్టుకుపోయినట్లు అంచనా. 235 మంది మృతదేహాలు మాత్రమే లభ్యమైనట్లు ప్రభుత్వం ప్రకటించింది.