Vande Bharat Express: తెలుగు రాష్ట్రాల మధ్య (సికింద్రాబాద్ – తిరుపతి) మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) రైలు పట్టాలెక్కేందుకు సిద్దమైంది. ఈరైలును ప్రధాని మోదీ (PM Modi) సికింద్రాబాద్ నుంచి ఈ రోజు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి బీజేపీ నేతలు, గవర్నర్ తమిళసై స్వాగతం పలికారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేసిన అనంతరం సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ రైలు ప్రారంభించారు.
వందే భారత్ ఎక్స్ప్రెస్ నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఆగుతుందని ఇప్పటికే సౌత్ సెంట్రల్ రైల్వే వెల్లడించింది. సికింద్రాబాద్ – తిరుపతి మధ్య నడిచే (20701) రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉదయం 6గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 2.30గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అలాగే, తిరుపతి – సికింద్రాబాద్ (20702) రైలు తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరి రాత్రి 11.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకోనుంది. మంగళవారం మినహా మిగిలిన రోజుల్లో ఈ రైలు సేవలందిస్తుంది.
సికింద్రాబాద్ నుంచి తిరుపతి ఏసీ ఛైర్కార్ టికెట్ ధర రూ.1680, ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ టికెట్ ధరను రూ.3080లుగా నిర్ణయించారు. అదే, తిరుపతి నుంచి సికింద్రాబాద్కు ఏసీ ఛైర్కార్ టికెట్ ధర రూ.1625, ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ టికెట్ ధరను రూ.3030లుగా పేర్కొన్నారు. ఈ రెండు ధరల్లో స్వల్ప వ్యత్యాసం గమనించవచ్చు. సికింద్రాబాద్-తిరుపతి టికెట్ ధరలను పరిశీలిస్తే బేస్ ఫేర్ రూ.1168గా నిర్ణయించారు. రిజర్వేషన్ ఛార్జీ రూ.40, సూపర్ ఫాస్ట్ ఛార్జీ రూ.45, మొత్తం జీఎస్టీ రూ.63గా పేర్కొన్నారు. రైల్లో సరఫరా చేసే ఆహార పదార్థాలకు గానూ రూ.364 చొప్పున ఒక్కో ప్రయాణికుడి నుంచి క్యాటరింగ్ ఛార్జీ వసూలు చేయనున్నారు. అదే తిరుపతి- సికింద్రాబాద్ రైల్లో బేస్ ఛార్జీని రూ.1169గా పేర్కొన్నారు. కేటరింగ్ ఛార్జీని మాత్రం రూ.308గా పేర్కొన్నారు. దీంతో అప్ అండ్ డౌన్ ఛార్జీల్లో వ్యత్యాసం నెలకొంది. ఈ ఛార్జీలకు టికెట్ బుకింగ్ కన్వీనియెన్స్ ఛార్జీలు అదనంగా ఉంటాయి.
ఛార్జీలు ఇలా.. ఛైర్ కార్
సికింద్రాబాద్ నుంచి నల్గొండకి – రూ.470
సికింద్రాబాద్ నుంచి గుంటూరుకి – రూ.865
సికింద్రాబాద్ నుంచి ఒంగోలుకి – రూ.1075
సికింద్రాబాద్ నుంచి నెల్లూరుకి – రూ.1270
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి – రూ.1680
ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ ఛార్జీలు
సికింద్రాబాద్ నుంచి నల్గొండకి – రూ.900
సికింద్రాబాద్ నుంచి గుంటూరుకి – రూ.1620
సికింద్రాబాద్ నుంచి ఒంగోలుకి – రూ.2045
సికింద్రాబాద్ నుంచి నెల్లూరు – రూ.2455,
సికింద్రాబాద్ నుంచి తిరుపతి – రూ.3080
#WATCH | Telangana | PM Narendra Modi flags off Vande Bharat Express between Secunderabad and Tirupati.
It will reduce the travel time between the two cities by almost three and a half hours. pic.twitter.com/UCMd6yuWqC
— ANI (@ANI) April 8, 2023