విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ (TDP) జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Chandra Babu Naidu Arrest) అక్రమ అరెస్టుకు నిరసనగా శనివారం పద్మనాభం ( Padmanabham ) జంక్షన్లో టిడిపి నాయకులు మానవహారంగా ఏర్పడి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేసారు. చంద్రబాబు నాయుడిని తక్షణం విడుదల చేయాలన్నారు. అక్రమ అరెస్టులతో వైసిపి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని తెదేపా నేతలు విమర్శించారు. అనంతరం పద్మనాభం పోలీసులు అదుపులోకి తీసుకున్న టీడీపీ మండల (Padmanabham TDP) అధ్యక్షుడు కే రమణ, వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే దామోదర్ రావులను విడుదల చేయాలని పోలీసులు స్టేషన్ (Padmanabham Police Station) ఎదుట టిడిపి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ తెదేపా నాయకులు పద్మనాభం పోలీస్ స్టేషన్ ఎదుట నినాదాలు తెలుపుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా సీనియర్ నాయకులు మజ్జి నందీశ్వర రావు, మహిళా ఉపాధ్యక్షురాలు లీలావతి, తెలుగు యువత అధ్యక్షులు కాళ్ల సత్యనారాయణ, కే ఎర్రినాయుడు తదితరులు. పాల్గొన్నారు.