విశాఖపట్నం: మండల కేంద్రమైన పద్మనాభం (Padmanabham) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బదిలీ అయిన ఉపాధ్యాయులు వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పద్మనాభం ఎంపీపీ కంటుబోతు రాంబాబు కొంతసేపు ఉపాధ్యాయ అవతారమెత్తి విద్యార్థులకు బోధించారు. గణితంలోని కొన్ని అంశాలను బోధించారు. రాజకీయ నాయకుడి అయినా తాను పొందిన ఉపాధ్యాయ శిక్షణ ద్వారా లభించిన అనుభవంతో విద్యార్థులకు ఆయన పాఠాలు బోధించారు. బీఎస్సీ, బీఈడీ చేసిన ఆయన ఉపాధ్యాయ వృత్తి ప్రారంభించాలని అనుకున్నా.. అనుకోని పరిస్థితులలో యుక్తవయసులోనే రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసారు. సర్పంచిగా భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్గా, భీమిలి మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్ గా, మరియు ఇన్చార్జ్ చైర్మన్ గా పలు పదవులను నిర్వర్తించి ప్రస్తుతం పద్మనాభం మండల ఎంపీపీ (Padmanabham MPP)గా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో పద్మనాభం జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయుల వీడ్కోలు సభలో పాల్గొనడానికి వచ్చి పదవ తరగతి విద్యార్థులతో ముచ్చటించారు.
/Web Stories/