క్రీడలు/ఆస్ట్రేలియా: టీ20 ప్రపంచకప్ (T20 World Cup) లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. బ్యాటింగ్లో సూర్యకుమార్ (61*) దూకుడుగా ఆడి హాఫ్సెంచరీతో పాటు టీ20ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. రాహుల్ (51) కూడా హాఫ్ సెంచరీతో రాణించగా.. కోహ్లీ (26), రోహిత్ (15), హార్దిక్ (18) ప్రేక్షకులు ఆశించిన మేరకు ఆడలేకపోయారు.