Amaravati: ఏపీలో జోనల్ వ్యవస్థ ఏర్పాటు, వివిధ ఉద్యోగ సమస్యలపై మంత్రి వర్గ ఉప సంఘం (Cabinet sub-committee) సమావేశం జరిగింది. “ఏపీలో జోనల్ వ్యవస్థ ఏర్పాటుపై కసరత్తు ముమ్మరం చేశామని మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) అన్నారు. జోనల్ వ్యవస్థ ఏర్పాటుపై కసరత్తు తుది దశలో ఉందన్నారు. జోనల్ వ్యవస్థపై ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరుపుతామని, త్వరలో కారుణ్య నియామకాలు చేపడతామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై త్వరలో గైడ్ లైన్స్ ఇస్తాం. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కటాఫ్ డేట్ మార్చే అంశంపై ఆలోచన చేస్తున్నాం. ఆగస్టు 7న కాంట్రాక్టు ఉద్యోగుల క్రబద్దీకరణపై జీవో ఇస్తాం.” అని మంత్రి బొత్స తెలిపారు.