విశాఖపట్నం: చోడవరంలో వైసీపీ విద్యార్థి భేరిలో వైసీపీ నేతలకు విద్యార్థుల రూపంలో షాక్ తగిలింది. రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ నేతృత్వంలో విద్యార్థి భేరి నిర్వహించారు. ఈ వైసీపీ ర్యాలీ లో జనసేనకు అనుకూలంగా విద్యార్ధులు నినాదాలు చేపట్టారు. సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అంటూ నినాదాలు చేశారు. దీంతో వైసీపీ నేతలు అవాక్కయ్యారు.